భర్తను మర్మంగాలపై తన్ని.. ఆ తర్వాత అతనిపై హిట్ కొట్టి.. గొంతు పిసికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఫిల్మ్ నగర్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ...
భర్తను మర్మంగాలపై తన్ని.. ఆ తర్వాత అతనిపై హిట్ కొట్టి.. గొంతు పిసికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఫిల్మ్ నగర్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ హత్య కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. మొదట తానే స్వయంగా తన భర్తను హత్య చేసినట్లు తెలిపిన దేవిక.. ప్రియుడ్ని కాపాడేందుకే ఇలా చేసినట్లు విచారణలో తేలింది. తన ప్రియుడి కోసం భర్తను దారుణంగా హత్య చేసిందా ఇల్లాలు. వారి పిల్లలు చెప్పిన వివరాలతో కేసును విచారించిన పోలీసులు, 24 గంటల్లోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఆపై ప్రియుడిని, ఆమెను కటకటాల వెనక్కు నెట్టారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి బర్త్ ప్లేస్ ఆసుపత్రిలో దంపతులు బానోతు జగన్ (35), దేవిక (30) పని చేస్తూ ఓ ఇంట్లో అద్దెకు ఉంటుండగా, వారికి ఎనిమిదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన తోట బెనర్జి(32) ఫిలింనగర్లోని అడ్వాన్ సాఫ్ట్ బీపీఓలో లైజన్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. ఇదే సంస్థలో దేవిక హౌస్ కీపింగ్ పనిచేసేది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి దగ్గరయ్యారు. ఏడాది క్రితం బెనర్జి దేవిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. కుటుంబ సభ్యులు అతడిని తిట్టి పనిచేస్తున్న సంస్థ వద్దకు వచ్చి చితకొట్టారు. ఆరు నెలల క్రితమే దేవిక అక్కడ హౌస్కీపింగ్ పనుల నుంచి తప్పుకుంది.
అయితే భర్త కళ్లుగప్పి ప్రియుడితో తరచూ కలుస్తుండేది. అనుమానం వచ్చిన జగన్ పలుమార్లు ఆమెను హెచ్చరించి పరువుతీయవద్దంటూ బెదిరించాడు. ఇలా అయితే లాభం లేదనుకున్న బెనర్జి, దేవిక ఒకే ఇంట్లో అద్దెకుంటే ఈ గొడవ ఉండదని అనుమానాలు కూడా రావని నిశ్చయించుకున్నారు. రెండు నెలల క్రితం బెనర్జి.. జైల్సింగ్ నగర్లోని ఓ ఇంటిలో జగన్ దంపతులను అద్దెకు దిగేలా చేశాడు. తర్వాత రెండు రోజులకే తాను కూడా అదే ఇంటి పెంట్హౌస్లోకి మారుపేరుతో అద్దెకు దిగాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా ఇద్దరూ కలుసుకునేవారు.
ఈ క్రమంలో జగన్ ను హత్య చేయాలని దేవిక, బెనర్జీ ప్లాన్ చేశారు. సోమవారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో జగన్ నిద్రిస్తున్న వేళ, అతని మర్మాంగాలను దేవిక గట్టిగా పిసికేస్తుండగా, అతని ఛాతీపై కూర్చున్న బెనర్జీ, గొంతును నులిమి హత్య చేశాడు. దాదాపు అరగంట పాటు ఈ హత్యాకాండ సాగగా, మధ్యలో పిల్లలు నిద్రలేవడంతో వారిని బాత్ రూములో వేసిన దేవిక, బయట గడియపెట్టింది. జగన్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత, పూటుగా మద్యం తాగిన ఇద్దరూ రాసలీలలు ఆడారు. ఆపై గంట సేపటి తరువాత బెనర్జీ వెళ్లిపోగా, తన సోదరుడికి ఫోన్ చేసిన దేవిక, బావ చనిపోయాడని చెబుతూ, చేతులకు గాయాలు చేసుకుంది.
తన భర్తను తానే చంపానని, తనను హింసిస్తుంటే తట్టుకోలేకపోయానని దేవిక పోలీసులకు చెప్పింది. అయితే, పిల్లలు మాత్రం మరో అంకుల్ వచ్చాడని చెప్పగా పోలీసులు ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. అప్పుడే ఆరు నెలల క్రితం బెనర్జీతో జరిగిన గొడవ, బెనర్జీ ఉంటున్నది హత్య జరిగిన ఇంటి పై పోర్షన్ లోనేనని తేలింది. ఆపై బెనర్జీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో హత్య వెనుక అతని ప్రమేయం ఉందన్న నిర్దారణకు వచ్చి పోలీసులు, సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా అతనిని అరెస్ట్ చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire