పసికందుపై యాసిడ్‌ పోసిన మంత్రగత్తె

పసికందుపై యాసిడ్‌ పోసిన మంత్రగత్తె
x
Highlights

నెల వయసున్న పసికందుపై యాసిడ్‌ పోసిన ఘటన రాజస్థాన్‌లోని సవారు మాధోపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియాంన్ష్‌ అనే శిశువు న్యూమోనియా వ్యాధితో...

నెల వయసున్న పసికందుపై యాసిడ్‌ పోసిన ఘటన రాజస్థాన్‌లోని సవారు మాధోపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియాంన్ష్‌ అనే శిశువు న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి ఎంతకు తగ్గట్లేదు. దీంతో తనకు తెలిసిన ఓ మంత్రగత్తె వద్దకు తన బిడ్డను తల్లి తీసుకొని వెళ్లింది. యాసిడ్‌ పోస్తే న్యూమోనియా తగ్గుతుందని భావించిన ఆ మంత్రగత్తె.. పసికందు ఛాతీపై యాసిడ్‌ పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంత్రగత్తెను, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ మంత్రగత్తె.. చిన్నారులకు సోకిన వ్యాధులను నయం చేస్తుందని భావించి.. ఆమె వద్దకు భారీ సంఖ్యలో పిల్లలను తీసుకువస్తారని పోలీసుల విచారణలో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories