అంజన్నకు ఆగ్రహమొచ్చిందా...కోతులను చంపడంతోనే ప్రమాదం జరిగిందా?

అంజన్నకు ఆగ్రహమొచ్చిందా...కోతులను చంపడంతోనే ప్రమాదం జరిగిందా?
x
Highlights

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆగ్రహం కారణంగానే ఘాట్ రోడ్డులో ప్రమాదం సంభవించిందా? స్వామివారికి ప్రతిరూపంగా భావించే వానరాలను చంపేయడంతోనే ఈ బస్సు లోయలోకి...

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆగ్రహం కారణంగానే ఘాట్ రోడ్డులో ప్రమాదం సంభవించిందా? స్వామివారికి ప్రతిరూపంగా భావించే వానరాలను చంపేయడంతోనే ఈ బస్సు లోయలోకి పడిపోయిందా? జగిత్యాల జిల్లాలో చాలామంది ఈ విషయమై చర్చించుకుంటున్నారు. జిల్లాలోని కొడిమ్యాల మండలం, సూరంపేట మామిడివాగు దగ్గర దాదాపు 60 వానరాల కళేబరాలు కనిపించాయి. వీటిని పరిశీలించిన కొడిమ్యాల రేంజర్ లత.. వానరాలను కరెంట్ షాక్ పెట్టి హతమార్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే..అంజన్నస్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారమే కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కోతుల కళేబరాలు లభ్యమైన సంఖ్యలోనే ప్రయాణికులు మృతి చెందడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పలు గ్రామాల ప్రజలు అంజన్నకు ఆగ్రహం రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories