సీపీఐ నేతలతో కోదండరాం భేటీ

సీపీఐ నేతలతో కోదండరాం భేటీ
x
Highlights

టీజేఎస్ అధినేత కోదండరాం సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. కూటమిలో రెండుపార్టీలకు సీట్ల కేటాయింపుపై చర్చించారు. బెల్లంపల్లి, వైరా, దేవరకొండ స్థానాలు...

టీజేఎస్ అధినేత కోదండరాం సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. కూటమిలో రెండుపార్టీలకు సీట్ల కేటాయింపుపై చర్చించారు. బెల్లంపల్లి, వైరా, దేవరకొండ స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉందని అయితే హుస్నాబాద్ , కొత్తగూడెం స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతుంది. కొత్తగూడెం స్థానం కోసం జాతీయ నాయకులపై కూనంనేని సాంబశివరావు ఒత్తిడి తెస్తున్నారు. సీపీఐకి మూడు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎన్నికల్లో గెలిచాక రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ ప్రతిపాదనలపై సీపీఐ , టీజేఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories