పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ...

x
Highlights

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వేదికగా టీఆర్ఎస్ మరోసారి బలాన్ని ప్రదర్శించబోతోంది. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ...

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వేదికగా టీఆర్ఎస్ మరోసారి బలాన్ని ప్రదర్శించబోతోంది. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్‌‌లో టీఆర్ఎస్ సభకు నిన్న మధ్యాహ్నం అనుమతి రావడంతో నేతలు హడావిడిగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కొద్ది గంటల సమయంలోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌ సభావేదికగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేస్తారు. కేసీఆర్ మరిన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తారని అంచనా. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తారు. అలాగే ఈ సభకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజక వర్గాల అభ్యర్థులు హాజరువుతున్నారు. ఈ వేదిక నుంచి 24 నియోజకవర్గాల అభ్యర్థులను సీఎం కేసీఆర్ పరిచయం చేస్తారు. గ్రేటర్ నలమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌ ప్రచారంలో ప్రజా కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం కేసీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చా అవకాశం ఉంది. ఈ సభకు దాదాపు 2 లక్షల మంది తరలివస్తారని అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories