కష్టాల్లో వెస్టిండీస్‌..

కష్టాల్లో వెస్టిండీస్‌..
x
Highlights

మొదట టెస్టు సిరీస్‌ తరువాత వన్డే సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా.. రెట్టించిన ఉత్సహంతో టీ20 సిరీస్‌లోనూ వెస్టిండీస్‌తో చీల్చిచెండాడటానికి భారత్‌...

మొదట టెస్టు సిరీస్‌ తరువాత వన్డే సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా.. రెట్టించిన ఉత్సహంతో టీ20 సిరీస్‌లోనూ వెస్టిండీస్‌తో చీల్చిచెండాడటానికి భారత్‌ సిద్ధమైంది. మూడు t20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. బ్యాటింగుకు దిగిన విండీస్ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 63 పరుగులు చేసి కష్టాల్లో పడింది. క్రీజులో అలెన్, పాల్ ఉన్నారు. కాగా గాయం కారణంగా హార్ధిక్‌ పాండ్యా మ్యాచ్‌కు దూరం కావడంతో అతని సోదరుడు కృనాల్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌ ద్వారా కృనాల్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories