ఏపీ అసెంబ్లీ ముందు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

ఏపీ అసెంబ్లీ ముందు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
x
Highlights

అమరావతిలో టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీ రగడ చెలరేగింది. మోడీజీ? ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గోషా, ఆనాడు కాంగ్రెస్ పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్ర ప్రదేశ్...

అమరావతిలో టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీ రగడ చెలరేగింది. మోడీజీ? ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గోషా, ఆనాడు కాంగ్రెస్ పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్ర ప్రదేశ్ ను విభజించింది. ఇప్పుడు పార్లమెంట్ తలుపులు తీసి విభజన హామీలను తుంగలో తొక్కుతున్నారు, విభజన హామీలు అమలు చేయకపోతే తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు అంటూ అసెంబ్లీ సమీపంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఈ ఫ్లెక్సీలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ.. టీడీపీని మిత్రపక్షంగానే భావిస్తుందని, ఈ తరహా దుష్ప్రచారం తగదని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హితవు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories