కార్పొరేటర్‌ ఘాతుకం...బ్యూటీ సెలూన్‌లో మహిళను...

x
Highlights

తమిళనాడులోని పెరంబళూరులో దారుణం జరిగింది. డీఎంకే కు చెందిన కార్పొరేటర్‌ సెల్వకుమార్‌ దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ...

తమిళనాడులోని పెరంబళూరులో దారుణం జరిగింది. డీఎంకే కు చెందిన కార్పొరేటర్‌ సెల్వకుమార్‌ దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌ లోకి చొరబడి ఓ మహిళను విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. మహిళ కడుపుపై కనికరం లేకుండా పదే పదే కాలితో తన్నాడు. అక్కడే ఉన్న మిగతా మహిళలు కొట్టవద్దని బతిమాలిన పట్టించుకోలేదు. ఈ ఏడాది మే 25 న జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ విజువల్స్ ను బ్యూటీ పార్లర్‌ యాజమాన్యం పోలీసులకు అప్పగించింది. వీడియో ఆధారంగా సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎంకే పార్టీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories