కర్నూలు జిల్లాలో కీచకపర్వం...ఒంటరి మహిళపై ఇద్దరు పోలీసుల అత్యాచార యత్నం

x
Highlights

కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులు కీచకులుగా మారారు. ఒంటరిగానున్న మహిళపై అత్యాచారయత్నం చేశారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఓ మహిళ కూల్...

కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులు కీచకులుగా మారారు. ఒంటరిగానున్న మహిళపై అత్యాచారయత్నం చేశారు.
కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఓ మహిళ కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తోంది. మద్యం మత్తులో ఓ ఆకతాయితో కలిసి నాగరాజు, శివరామ్ అనే కానిస్టేబుళ్లు కూల్ డ్రింక్ షాప్ వద్దకు వచ్చారు. ఒంటరిగానున్న మహిళతో అసభ్యంగా మాట్లాడారు. డబ్బులు చేతుల్లో పెట్టి అత్యాచార యత్నం చేశారు. ఆ మహిళ ప్రతిఘటించడంతో..ఆకతాయితో సహా ఇద్దరు పోలీసుల జారుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసు ఉన్నాతాధికారులు కానిస్టేబుళ్ల నిర్వాకంపై విచారణ జరిపించారు. కీచక కానిస్టేబుళ్లు నాగరాజు, శివరామ్‌లతో పాటు హాజీవలి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories