మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్

x
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు చేసినా హైకమాండ్...

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు చేసినా హైకమాండ్ కనికరించలేదు మూడో లిస్టులో మర్రి పేరును ప్రకటించలేదు. మరోవైపు మర్రిశశిధర్ రెడ్డి ఆశించిన సనత్ నగర్ స్థానంలో టీటీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. సనత్ నగర్ నియోజకవర్గానికి తమ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ ను ఎంపిక చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది. ఇందులో బోథ్ నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్ అర్బన్ నుంచి తాహేర్ బిన్ హమ్‌దాన్, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ రేకుల భూపతిరెడ్డి, బాల్కొండ నుంచి ఇ.అనిల్‌కుమార్, ఎల్‌.బి.నగర్ నుంచి డి.సుధీర్‌రెడ్డి, కార్వాన్ నుంచి ఒసామాబిన్ మహ్మద్ అలీ హజ్రీ, యాకుత్‌పురా నుంచి కె.రాజేంద్రరాజు, బహుద్దూర్‌పురా నుంచి కాలెం బాబా, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, దేవరకొండ నుంచి బాలు నాయక్, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య, ఇల్లెందు నుంచి బాణోత్ హరిప్రియ నాయక్ పేర్లు ఖారరయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories