కివీ హంట్... పాంచ్ పటాకా వన్డే సిరీస్‌లో టీమిండియా జోరు

కివీ హంట్... పాంచ్ పటాకా వన్డే సిరీస్‌లో టీమిండియా జోరు
x
Highlights

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ ను....టీమిండియా జోరుగా ప్రారంభించింది. నేపియర్ వేదికగా ముగిసిన తొలివన్డే విజయంతో సిరీస్ కు గురిపెట్టింది....

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ ను....టీమిండియా జోరుగా ప్రారంభించింది. నేపియర్ వేదికగా ముగిసిన తొలివన్డే విజయంతో సిరీస్ కు గురిపెట్టింది. అయితే....కివీగడ్డపై ఆడిన సిరీస్ ల్లో మాత్రం టీమిండియాకు ఇప్పటికీ అంతంత మాత్రం రికార్డే ఉంది. ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ తొలివన్డేకు ముందు వరకూ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు ఓసారి చూద్దాం...

వన్డే క్రికెట్ రెండోర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టీమిండియా...న్యూజిలాండ్ గడ్డపై అతిపెద్ద సిరీస్ విజయానికి ఉరకలేస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ట్విన్ సిరీస్ లో భాగంగా... కివీస్ తో ప్రారంభమైన పాంచ్ పటాకా వన్డే సిరీస్ తొలివన్డేలో భారీవిజయంతో బోణీ కొట్టింది. సిరీస్ విజయమే లక్ష్యంగా రెండో వన్డే బరిలోకి దిగుతోంది. అయితే...1976 నుంచి 2014 వరకూ న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా ఆడిన సిరీస్ ల్లో అంతంత మాత్రం రికార్డే ఉంది. మొత్తం ఏడు సిరీస్ ల్లో టీమిండియా ఒక్క సిరీస్ మాత్రమే నెగ్గిందంటే... న్యూజిలాండ్ తమ దేశంలో ఎంత పటిష్టమైన జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే...టీమిండియా, న్యూజిలాండ్ జట్లు.. రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండుజట్ల ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ ...ఉత్కంఠభరితంగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ గడ్డపై 1976 నుంచి భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ వస్తోంది. 2014 వరకూ ఆడిన మొత్తం ఏడు సిరీస్ ల్లో భారత్ ఒకే ఒక్కసారి విజేతగా నిలిచింది. 1976 సిరీస్ లో 0-2తో పరాజయం పొందిన భారత్ కు...1991 సిరీస్ లో సైతం అదే ఫలితం ఎదురయ్యింది. 1994 లో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసి సత్తా చాటుకొంది. అంతేకాదు...1999 సిరీస్ ను 2-2తో సమం చేయగలిగింది.

2002-03 జరిగిన ఏడు మ్యాచ్ లో సిరీస్ లో భారత్ కు 2-5తో భారీ ఓటమి తప్పలేదు. 2009 సిరీస్ లో భారత్ తొలిసారిగా న్యూజిలాండ్ పై 2-1తో విజేతగా నిలిచింది. కివీ గడ్డపై భారత్ కు ఇదే తొలి సిరీస్ విజయం కావటం విశేషం. ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్ వేదికగా ముగిసిన ఐదుమ్యాచ్ లో సిరీస్ లో ఓమ్యాచ్ ను టైగా ముగించిన భారత్...మిగిలిన నాలుగువన్డేల్లోనూ పరాజయాలు చవిచూసింది. చివరకు 0-4తో సిరీస్‌ను చేజార్చుకొంది.

ఓవరాల్ గా ఈ రెండుజట్ల మథ్య...న్యూజిలాండ్ గడ్డపై జరిగిన 7 సిరీస్ ల్లో కివీటీమ్ నాలుగు సిరీస్ విజయాలు సాధిస్తే...రెండు సిరీస్ లు డ్రాగా ముగిసాయి. ఓ సిరీస్ లో మాత్రమే భారత్ విజేతగా నిలిచింది. ఈ రెెండుజట్ల మధ్య జరిగిన వన్డే ల్లో సైతం...న్యూజిలాండ్ ఆధిక్యమే కనిపిస్తుంది. న్యూజిలాండ్ తో భారత్ మొత్తం 35 వన్డేల్లో తలపడితే...11 విజయాలు సాధించి...21 పరాజయాలు చవిచూసింది. ఓ మ్యాచ్ టైగా ముగిగియగా...మరో రెండు వన్డేలు ఫలితం తేలకుండానే రద్దులపద్దులో చేరాయి. ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ లో మాత్రం...విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. నేపియర్ వేదికగా జరిగిన తొలివన్డేలో టీమిండియా స్థాయికి తగ్గట్టుగా ఆడి...కివీస్ ను చిత్తు చేయడం ద్వారా ఏకంగా సిరీస్ విజయానికే గురిపెట్టింది. సెయింట్ మాంగునీ లోని బే ఓవల్ వేదికగా శనివారం జరిగే రెండో వన్డేలో సైతం విజయమే లక్ష్యంగా విరాట్ సేన పోటీకి సిద్ధమయ్యింది. మరోవైపు...తొలివన్డే ఓటమితో కంగుతిన్న కివీస్ ...దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో ఉంది. తొలివన్డేను మించి...ఈ రెండో వన్డే పట్టుగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories