వీధిలైట్లు ఆర్పేసి.. రహస్య ప్రాంతానికి శిఖా చౌదరి!

వీధిలైట్లు ఆర్పేసి.. రహస్య ప్రాంతానికి శిఖా చౌదరి!
x
Highlights

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి, ...

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి, అతనికి సహకరించిన మరికొందరిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక జయరాం మేనకోడలు శిఖా చౌదరిని రాత్రి నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయం నుంచి మరో చోటికి తరలించారు. అది కూడా చాలా గోప్యంగా ఉంచేందుకు పోలీసులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అర్థరాత్రి వీధిలైట్లు ఆర్పేసి, శిఖా చౌదరికి బురఖా వేసి తర్వాత కారులో తీసుకెళ్లారు.

కంచికచర్ల నుంచి జగ్గయ్యపేట తీసుకెళ్లి అక్కడ రాంకో కంపెనీ గెస్ట్‌హౌస్‌లో ఉంచారు. ఐతే.. ఈ తరలించే క్రమంలో ఆమెను హైదరాబాద్ తీసుకొస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలిగాయి. అయితే అర్ధరాత్రి సమయంలో శిఖా చౌదరిని రహస్య ప్రాంతానికి తరలించడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురయిన జయరామ్‌ భార్య పద్మశ్రీ.. మేనకోడలు శిఖాచౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు. శిఖా చౌదరిది క్రిమినల్‌ మైండ్‌ అంటూ దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories