వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; ఎన్‌ఐఏ చార్జిషీట్‌

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; ఎన్‌ఐఏ చార్జిషీట్‌
x
Highlights

ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ వేసింది. ఛార్జ్‌షీట్‌లో ఏ1 నిందితుడిగా శ్రీనివాస్‌ని పేర్కొంది. ఈ...

ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ వేసింది. ఛార్జ్‌షీట్‌లో ఏ1 నిందితుడిగా శ్రీనివాస్‌ని పేర్కొంది. ఈ కేసులో విచారణ ఇంకా ఉందని ఎన్‌ఐఏ అధికారులు స్పష్టం చేశారు. చార్జిషీట్‌ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, గోప్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. కాగా శ్రీనివాస్ రాసుకున్న లేఖను కోర్టుకు ఎన్‌ఐఏ సమర్పించింది. ఇక ఈ నెల 25న ఛార్జ్‌షీట్‌లో ఏముందో తెలిసే అవకాశం ఉంది. ఇదిలావుంటే శ్రీనివాసరావు తరుపు లాయర్లు మాత్రం చార్జిషీట్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ కేసుపై పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా అత్యవసరంగా ఛార్జ్‌షీట్‌ ఎందుకు దాఖలు చేశారని వారు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories