అమ్మాయిని వివస్త్రను చేసి.. బ్లేడ్‌తో దారుణం

అమ్మాయిని వివస్త్రను చేసి.. బ్లేడ్‌తో దారుణం
x
Highlights

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే దారుణం జరిగింది. ఓ బాలికపై గంజాయి మత్తులో ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఒళ్లంతా...

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే దారుణం జరిగింది. ఓ బాలికపై గంజాయి మత్తులో ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఒళ్లంతా బ్లేడుతో ఇష్టం వచ్చినట్లుగా గాట్లు పెట్టాడు. ఈ దారుణాన్ని పైశాచిక ఆనందం పొందుతూ అతడి స్నేహితులు మొబైల్లో వీడియో తీశారు. తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాట్సాప్ లో పోస్టు చేశారు. మహిళాదినోత్సవం నాడు హైదరాబాద్ లో దుశ్వాసన పర్వం జరిగింది.

హైదరాబాద్‌లోని డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతంలో కొందరు బాలలు రోజూ సాయంత్రం గంజాయి తాగుతుంటారు. స్థానికంగా నివసించే ఓ బాలికకు గంజాయిని అలవాటు చేశారు. ఈ నెల 2న అర్ధరాత్రి దాటాక గంజాయి మత్తులో ఓ బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గంజాయి మత్తులో బాలుడు అత్యంత హేయంగా ప్రవర్తించాడు. ఆమెకు బ్లేడుతో ఒళ్లాంతా గాట్లు పెట్టాడు. 'దయచేసి నన్ను వదిలెయ్‌'' అంటూ వేడుకున్నా విన్లేదు. ఈ ఘటనలో ఆ ఉన్మాదికి కొందరు స్నేహితులూ సహకరించారు. పైశాచిక ఆనందం పొందుతూ ఈ దారుణాన్ని మొబైల్లో చిత్రీకరించారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. స్నేహితులకు వాట్సాప్ ద్వారా షేర్ చేశారు.

అత్యాచారం వీడియోను తొలగించాల్సిందిగా బాలిక నిందితుడిని వేడుకుంది. ఈ నెల ఏడోతేదిన తనను డీబీఆర్‌ మిల్స్‌ వద్ద కలవాలని అతడు డిమండ్ చేయగా, ఆమె వెళ్లింది. ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోయేసరికి ఆమె కుటుంబసభ్యులు గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ అమానవీ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు యూట్యూబ్‌లో పెట్టిన వీడియోను తీయించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories