గుంటూరు జిల్లాలో ప్రేమికుడి చేతిలో దారుణ హత్యకు గురైన మరో 'జ్యోతి'

గుంటూరు జిల్లాలో ప్రేమికుడి చేతిలో దారుణ హత్యకు గురైన మరో జ్యోతి
x
Highlights

గుంటూరు జిల్లాలో ప్రేమికుడి చేతిలో హత్యకు గురైన జ్యోతి ఘటన మరవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.ప్రియురాలి మీద అనుమానంతో ఆమె గొంతు కోసి చంపాడు...

గుంటూరు జిల్లాలో ప్రేమికుడి చేతిలో హత్యకు గురైన జ్యోతి ఘటన మరవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.ప్రియురాలి మీద అనుమానంతో ఆమె గొంతు కోసి చంపాడు ప్రియుడు తెనాలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెనాలికి చెందిన సత్యనారాయణ, జ్యోతిలు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా సత్యనారాయణకు జ్యోతిపై అనుమానంగా పెరిగింది. ఈ విషయంపై పలుమార్లు ఇద్దరిమధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో జ్యోతి మీద అనుమానం మరింత పెంచుకున్న సత్యనారాయణ గురువారం జ్యోతిపై దాడికి పాల్పడి, క్రూరంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories