కోళ్లు దొంగతనం చేస్తున్నాడని చావబాదారు..

కోళ్లు దొంగతనం చేస్తున్నాడని చావబాదారు..
x
Highlights

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోళ్లను దొంగతనం చేస్తున్నాడన్న కారణంతో వ్యక్తిని బంధించి చావబాదారు. వివరాల్లోకి వెళితే చిత్తూరుకు చెందిన...

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోళ్లను దొంగతనం చేస్తున్నాడన్న కారణంతో వ్యక్తిని బంధించి చావబాదారు. వివరాల్లోకి వెళితే చిత్తూరుకు చెందిన వేణుగోపాల్‌ చికెన్‌ పౌల్ట్రీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆ ఫారంలో కొన్ని రోజులుగా కోళ్లు దొంగతనం జరుగుతున్నట్లు యజమాని గుర్తించాడు. ఈ దొంగతనానికి పాల్పడుతోంది వేణుగోపాల్‌ అని అనుమానించసాగాడు. దాంతో ఆ వ్యక్తిని తన ఇంట్లో ఐదు రోజుల పాటు నిర్బంధించి చితక బాదారు. వారి భారీ నుంచి తప్పించుకొని వచ్చిన వేణుగోపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories