పెళ్ళికి నిరాకరించారని ప్రేమికుల ఆత్మహత్య

పెళ్ళికి నిరాకరించారని ప్రేమికుల ఆత్మహత్య
x
Highlights

పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారన్న కారణంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కుమురం భీం జిల్లా వాంకిడి మండలం మహాగాంలో చోటుచేసుకుంది....

పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారన్న కారణంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కుమురం భీం జిల్లా వాంకిడి మండలం మహాగాంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మడపాచి భరత్‌(22), అదే గ్రామానికి చెందిన గౌరుబాయి(18) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్ళికి నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన గౌరుబాయి పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో పడివున్న గౌరుబాయిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే విషయం తెలుసుకున్న భరత్ కూడా పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories