దారుణం : నడిరోడ్డుపై యువకుడి నరికివేత

దారుణం : నడిరోడ్డుపై యువకుడి నరికివేత
x
Highlights

చెన్నైలో దారుణం చోటుచేసుకుంది.. గంజాయి విక్రయాల విషయంలో ఏర్పడ్డ గొడవ హత్యకు దారితీసింది. చూలైమేడుకు చెందిన కుమరేశన్ అనే యువకుడు ఆ ప్రాంతంలో రహస్యంగా...

చెన్నైలో దారుణం చోటుచేసుకుంది.. గంజాయి విక్రయాల విషయంలో ఏర్పడ్డ గొడవ హత్యకు దారితీసింది. చూలైమేడుకు చెందిన కుమరేశన్ అనే యువకుడు ఆ ప్రాంతంలో రహస్యంగా గంజాయి విక్రయిస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతంలో గంజాయి విక్రయించే ముఠాకు కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే అవి తీవ్రమయ్యాయి. సోమవారం కుమరేశన్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో నరికి చంపటం స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories