యువకుడి ప్రాణాలు తీసిన ఎగ్జిబిషన్‌ సరదా

యువకుడి ప్రాణాలు తీసిన ఎగ్జిబిషన్‌ సరదా
x
Highlights

ఎగ్జిబిషన్‌ సరదా యువకుడి ప్రాణాలు తీసింది. జెయింట్ వీల్‌ పై నుంచి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు జారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్ధి...

ఎగ్జిబిషన్‌ సరదా యువకుడి ప్రాణాలు తీసింది. జెయింట్ వీల్‌ పై నుంచి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు జారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్ధి జయవరపు ఆనంద్ పాల్ మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమరవంలో ఉత్సవ్ ఎగ్జిబిషన్‌లో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఎగ్జిబిషన్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనంద్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సరదా కోసం ఎగ్జిబిషన్‌ కు వచ్చిన యువకుడు విగతజీవిగా మారాడన్న వార్తను కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories