వెనక్కు తగ్గేది లేదు...

వెనక్కు తగ్గేది లేదు...
x
Highlights

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను...

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎంపీలు రాజీనామాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము స్పీకర్ కు సమర్పించిన రాజీనామాల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. నేడు స్పీకర్ ను కలిసి రాజీనామాలపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న వైకాపా ఎంపీలు మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకునే తిరిగి రాష్ట్రానికి వస్తామని వైసీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు వస్తే, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని తాము నిర్ణయించుకున్నామని, బై ఎలక్షన్స్ కు తాము సిద్ధమేనని ఆయన అన్నారు. తామిచ్చిన రాజీనామా లేఖలను వెంటనే ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ను డిమాండ్ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను బీజేపీ దెబ్బ తీసిందని, రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. 13 సార్లు తాము అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చామని గుర్తు చేసిన ఆయన, వాటిపై చర్చ జరగకుండా బీజేపీ నాటకాలు ఆడిందని విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories