లోకేష్‌ మామూలు పప్పు కాదు: రోజా

లోకేష్‌ మామూలు పప్పు కాదు: రోజా
x
Highlights

హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, వైఎస్‌...

హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌ నిజంగానే పప్పు అని మరోసారి రుజువైందన్నారు. కంపెనీలు తెచ్చామని లోకేష్‌ గొప్పలు చెబుతున్నారనీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న లోకేష్‌ను పప్పు అని కాకుండా ఇంకేమని పిలవాలంటూ ఆమె మండిపడ్డారు. పప్పు అంటే ఇన్నిరోజులు విటమిన్‌ ఉన్న పప్పు అనుకున్నారు, కానీ అది గన్నేరు పప్పు అని ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే తెలుసుకుంటారని ఎద్దేవా చేశారు.

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఏరువాక చేస్తున్నచంద్రబాబుపై పోరువాకకు రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని, రైతులకు రూ.87 వేల కోట్లు బాకీపడ్డ చంద్రబాబు, ‘బాండ్లు’ అంటూ వాళ్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ పై విమర్శలు చేశారు. నాలుగేళ్ల పాటు సీఎం రమేష్ ఏం చేశారు? స్టీల్ ప్లాంట్ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉక్కు ఫ్యాక్టరీకి అడ్డుపడింది టీడీపీ నేతలు కాదా? అని ప్రశ్నించారు.

ఏపీకి రావాల్సింది ఏదీ రాకపోయినా.. కేంద్రంలో టీడీపీ ఎంపీలు, రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అనుభవించారని, ఇప్పటికిప్పుడు కడపకు ఏదో అన్యాయం జరిగిందంటూ సీఎ రమేష్ దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతున్న టీడీపీ నేతల్లో చిత్తశుద్ధి లేదని స్వయంగా ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే పలుమార్లు స్పష్టం చేశారని అన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని, 2014లో మహిళలపై వేధింపుల విషయంలో దేశంలో ఏపీ 9వ స్థానంలో ఉంటే.. ప్రస్తుతం 4వ స్థానానికి చేరిందని, చంద్రబాబు పాలన ఎంతగొప్పగా ఉందో దీనిని బట్టి అర్థమవుతోందని రోజా విమర్శించారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో తాను పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories