చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిన వైసీపీ

చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిన వైసీపీ
x
Highlights

సీఎం చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వైసీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. వైసీపీ విడుదల చేసిన ఛార్జిషీట్, టీడీపీ మ్యానిఫెస్టోలను దగ్గర పెట్టుకుని...

సీఎం చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వైసీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. వైసీపీ విడుదల చేసిన ఛార్జిషీట్, టీడీపీ మ్యానిఫెస్టోలను దగ్గర పెట్టుకుని సరిచూసుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని, అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తానని బాబు ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిల పడ్డారని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తేలేక పోయారని అన్నారు. ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాలను చంద్రబాబు పెంచి పోషించారని, టీడీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని వైసీపీ నేతలు మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories