రైలు ప్రయాణికులకు శుభవార్త…ఇకనుంచి..

రైలు ప్రయాణికులకు శుభవార్త…ఇకనుంచి..
x
Highlights

ప్రయాణికుకులకు శుభవార్త చెప్పింది ఐఆర్‌సీటీసీ. బోర్డింగ్ స్టేషన్‌ విధానంలో స్వల్ప మార్పులు చేసింది. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే...

ప్రయాణికుకులకు శుభవార్త చెప్పింది ఐఆర్‌సీటీసీ. బోర్డింగ్ స్టేషన్‌ విధానంలో స్వల్ప మార్పులు చేసింది. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఎవరైనా రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత ఎక్కే స్టేషన్ మార్చుకోవాలి అనుకుంటే.. ఆన్ లైన్ లో కనీసం ఒకరోజు పడుతోంది. పైపెచ్చు బోర్డింగ్ స్టేషన్‌లో ఎక్కకుంటే రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతోంది. ఇకపై ఆలా జరగదు. ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ లో కాకుండా మరోచోట ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బోర్డింగ్ స్టేషన్ మరోచోటుకి మార్చుకునే వెసులుబాటును ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది.

అయితే స్టేషన్ మార్చుకునే ప్రయాణికులకు, రెండు స్టేషన్లకూ మధ్య ఉన్న దూరానికి రైలు ఛార్జీ వెనక్కి రాదని స్పష్టం చేసింది. ఇక ఇది కేవలం ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేసుకున్నవారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. బుకింగ్ కౌంటర్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి లేదు. దీనికోసం ఐఆర్‌సీటీసీ లో వెబ్ సైట్‌లో ఐడీ పాస్ వార్డ్ లాగిన్ అయ్యి.. బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్ళాలి. రైలును ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories