ప్రతి ఎంపీ రాజీనామా చేయాలి: వైఎస్ జగన్

ప్రతి ఎంపీ రాజీనామా చేయాలి: వైఎస్ జగన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం రాష్ట్ర ఎంపీలందరూ కలసి రాజీనామాలు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం రాష్ట్ర ఎంపీలందరూ కలసి రాజీనామాలు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన ట్విటర్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ప్రతి ఎంపీ రాజీనామా చేయాలని అన్నారు. ‘ఇప్పుడు నిర్లిప్తంగా ఉండే సమయం కాదు. రాష్ట్ర ప్రయోజనం కోసం అందరం కలసి ఓ నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఎంపీ రాజీనామా చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముందుగా రాజీనామా చేస్తారని, వారిలా మీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారా? లేదా ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతూనే ఉంటారా? అని జగన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories