మళ్లీ ఓడిన రాజస్తాన్‌

మళ్లీ ఓడిన రాజస్తాన్‌
x
Highlights

ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. కింగ్స్‌ పంజాబ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఐపీఎల్‌లో భాగంగా ఐఎస్‌ బింద్రా...

ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. కింగ్స్‌ పంజాబ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఐపీఎల్‌లో భాగంగా ఐఎస్‌ బింద్రా మైదానంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. పంజాబ్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులే చేసింది. దీంతో ఈ సీజన్‌లో రాజస్తాన్‌కు ఆరో ఓటమి మూటగట్టుకోగా, పంజాబ్‌కు ఇది ఐదో విజయం. ముందుగా బ్యాటింగుకు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది.

పంజాబ్ ఆటగాళ్లలో లోకేశ్‌ రాహుల్‌ (47 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్‌ (27 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ అశ్విన్‌ (4 బంతుల్లో 17 నాటౌట్‌; ఫోర్, 2 సిక్స్‌లు) మెరిశారు. ఆర్చర్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడింది. రాహుల్‌ త్రిపాఠి (45 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. అర్‌‡్షదీప్, అశ్విన్, షమీ తలా 2 వికెట్లు తీశారు. అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories