చిక్కుల్లో టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి

చిక్కుల్లో టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి
x
Highlights

టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్బంగా డబ్బు పంపిణీ, ఎన్నికల ఖర్చుపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి...

టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్బంగా డబ్బు పంపిణీ, ఎన్నికల ఖర్చుపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలవడం కోసం ఒక్కో పార్టీ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని బహిరంగంగానే చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ, సీపీఐ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దాంతో ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. జేసీ మాటలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని.. నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి జేసీపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories