ఎన్టీఆర్ ఘాట్‌లో లక్ష్మీపార్వతికి చేదు అనుభవం

ఎన్టీఆర్ ఘాట్‌లో లక్ష్మీపార్వతికి చేదు అనుభవం
x
Highlights

టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకుని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో...

టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకుని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఘాట్‌లో ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. జగన్‌పై ప్రసంశలు కురిపిస్తూ.. టీపీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. తాను టీడీపీ వ్యతిరేకిని కాదని, చంద్రబాబుకు మాత్రమే వ్యతిరేకమని ఆమె వెల్లడించారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడాలని చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోమన్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినాదించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆమె మీడియాతో పూర్తిగా మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories