తల్లితో సహజీవనం.. కుమార్తెపై అత్యాచారం

తల్లితో సహజీవనం.. కుమార్తెపై అత్యాచారం
x
Highlights

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాదులోని పోలీస్ స్టేషన్‌ పరిధిలో...

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాదులోని పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ(35)కు నలుగురు పిల్లలు. మధ్యప్రదేశ్‌కు చెందిన జయవీర్‌(21)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో సఖ్యత లేకపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని జయవీర్‌తో కలిసి విజయవాడకు వెళ్లింది. అక్కడ రెండు నెలలు ఉండి గతేడాది మే నెలలో జల్‌పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్‌కాలనీకి వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఓ కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్నారు. మహిళతో సహజీవనం చేస్తున్న జయవీర్‌ ఆమె కూతురు(15)పై కన్నేశాడు. బాలికను బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. బాలికను వివాహం చేసుకుంటానని వేధిస్తున్నాడు. బాలిక తల్లి శనివారం సాయంత్రం పహడీషరీఫ్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని జయవీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories