అమిత్‌షాకు సోనీ నాయక్‌ తేనేటి విందు

అమిత్‌షాకు సోనీ నాయక్‌ తేనేటి విందు
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో ఆదరించిన తెలంగాణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. సభ్యత్వ నమోదులో భాగంగా...

సార్వత్రిక ఎన్నికల్లో ఆదరించిన తెలంగాణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. సభ్యత్వ నమోదులో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఇతర బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్ షా నేరుగా పహాడీషరీఫ్‌లోని రంగనాయకుల తండాకు బయల్దేరి వెళ్లారు.

రంగనాయకుల తండాలోని సోని నాయక్‌ ఇంట్లో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె తన చేతులతో వండిన జొన్న రొట్టెను తిన్నారు. అలాగే ఆమే చేసిన తేనీరు సేవించారు. ఈ సందర్భంగా సోని కుటుంబానికి బీజేపీ సభ్యత్వాన్ని ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకించారు. వారితో ఫోటోలు దిగారు. బీజేపీ నాయకులంతా సోనినాయక్ కుటుంబాన్ని పేరు పేరునా పలకరించారు.

ఆ తర్వాత రంగనాయకుల తండాలోని ప్రభుత్వ పాఠశాలలో అమిత్ షా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా వెంట కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత శంషాబాద్‌లో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories