ఫిదా పాటకు జనాలు ఫిదా..

ఫిదా పాటకు జనాలు ఫిదా..
x
Highlights

రెండేళ్ళ కింద వచ్చిన ఫిదా సినిమా నిజంగా అందరిని ఫిదా చేసిందనే చెప్పాలి . ముఖ్యంగా సాయి పల్లవి తన యాక్టింగ్ చరిష్మాతో అందరి దృష్టిని ఆకర్షించింది .....

రెండేళ్ళ కింద వచ్చిన ఫిదా సినిమా నిజంగా అందరిని ఫిదా చేసిందనే చెప్పాలి . ముఖ్యంగా సాయి పల్లవి తన యాక్టింగ్ చరిష్మాతో అందరి దృష్టిని ఆకర్షించింది .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . ఈ సినిమాలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది . ముఖ్యంగా 'వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కెట్ ఏసిండే.. గమ్మున కూర్చొనీయడే.. కుదురుగా నిల్చోనీయడే' అనే పాట మాత్రం శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది ..

ఇప్పటికి ఈ పాట ట్రేండింగ్ లో ఓ ఉపు ఉపుతుంది . ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ కంపోజ్ చేసారు. మధుప్రియ రాంకీ కలసి పాడారు. ఇపుడు ఈ పాట అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది . యూట్యూబ్ లో ఈ పాటను ఇప్పటి వరకు రెండు వందల మిలియన్లు అంటే 20 కోట్లు మందికి పైగా వీక్షించారు.ఎప్పటికప్పుడు వ్యూస్ ని లైక్స్ పెంచుకుంటూ ఈ రికార్డును సొంతం చేసుకుంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories