జియోపై వొడాఫోన్ ఫిర్యాదు

Highlights

వొడాఫోన్, రిలయన్స్ జియోపై టెలికం విభాగానికి ఫిర్యాదు చేసింది. అపరిమిత కాల్స్‌తో వస్తున్న జియో 4జీ ఫీచర్ ఫోన్ వల్ల తమ కంపెనీకి నష్టం కలుగుతుందంటూ...

వొడాఫోన్, రిలయన్స్ జియోపై టెలికం విభాగానికి ఫిర్యాదు చేసింది. అపరిమిత కాల్స్‌తో వస్తున్న జియో 4జీ ఫీచర్ ఫోన్ వల్ల తమ కంపెనీకి నష్టం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. జియో ఉచితంగా ఇవ్వనున్న ఈ ఫోన్ వల్ల ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన తాము మరిన్ని కష్టాల్లో పడిపోయే అవకాశం ఉందని టెలికం కమిషన్ మెంబర్ అనురాధ మిశ్రాకు లేఖ రాసింది.
అయితే ముందుగా ప్రకటించిన విధంగా రిలయన్స్ జియో నిన్న ఈ ఫోన్‌ను బీటా టెస్టింగ్ కోసం విడుదల చేసింది. ఈనెల 24 నుంచి బుకింగ్స్ మెుదలుకానున్నాయి. వచ్చేనెల మెుదటి వారంలో ఫోన్ వినియోగదారులకు చేరనుంది. అయితే డెలివరీ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories