సిరాజ్ కు షాకిచ్చిన కోహ్లి!

Highlights

హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు కెప్టెన్ కోహ్లీ మరిచిపోలేని బహుమతినిచ్చాడు. గత మంగళవారం కివీస్‌తో జరిగిన చివరి టీ20 ముగిసిన తర్వాత కోహ్లీ చేసిన...

హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు కెప్టెన్ కోహ్లీ మరిచిపోలేని బహుమతినిచ్చాడు. గత మంగళవారం కివీస్‌తో జరిగిన చివరి టీ20 ముగిసిన తర్వాత కోహ్లీ చేసిన పనికి సిరాజ్ షాక్ అయ్యాడు. ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే...ఇటీవల న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లో జరిగిన రెండో మ్యాచ్ ద్వారా సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా, చివరి టీ 20లో సిరాజ్ కు చోటు దక్కలేదు. తన తొలి మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్ ను మూడో టీ 20కి విశ్రాంతినిచ్చారు. అయితే మ్యాచ్ తరువాత మాత్రం కొత్త ఆటగాడైన సిరాజ్ కు ఊహించని షాకిచ్చి సంభ్రమాశ్చర్యానికి గురి చేశాడు కోహ్లి. మ్యాచ్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంలో ట్రోఫీ అందుకున్న కోహ్లీ.. దానిని నేరుగా తీసుకొచ్చి సిరాజ్‌కు ఇచ్చాడు. కోహ్లీ చేసిన పనికి సిరాజ్ షాక్ అయ్యాడు. భారత జట్టులోకొచ్చిన యువ క్రికెటర్లను ఇలా గౌరవించడం అనవాయితీగా మారింది. గతంలో ఎంఎస్ ధోని కెప్టెన్ గా చేసిన సమయంలో కూడా ఇలానే యువ క్రికెటర్లను ప్రోత్సహించేవాడు. ఇప్పుడు దాన్ని కోహ్లి కొనసాగిస్తూ మరొకసారి ధోనిని గుర్తు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories