రాజ‌మండ్రిలో ‘యు టర్న్’ తీసుకున్న సామ్

రాజ‌మండ్రిలో ‘యు టర్న్’ తీసుకున్న సామ్
x
Highlights

సినిమాల్లో పీహెచ్ డీ చేసిన స‌మంత రాజ‌మండ్రిలో యూట‌ర్న్ తీసుకుంది. ఏమాయ చేశావే సినిమాతో తెరంగ్రేటం చేసిన సామ్ టాప్ హీరోల‌తో వ‌రుస సినిమాల‌తో హిట్లు...

సినిమాల్లో పీహెచ్ డీ చేసిన స‌మంత రాజ‌మండ్రిలో యూట‌ర్న్ తీసుకుంది. ఏమాయ చేశావే సినిమాతో తెరంగ్రేటం చేసిన సామ్ టాప్ హీరోల‌తో
వ‌రుస సినిమాల‌తో హిట్లు కొట్టింది. కానీ తాను ఎన్ని బ్లాక్ బ్లాస్టర్ హిట్లు కొట్టినా త‌న‌కు ఓ చిరకాల కోరిక ఉన్న‌ట్లు మీడియాకు చెప్పింది. సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ‘యు టర్న్’ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో మెయిన్ లీడ్ క్యార‌క్ట‌ర్ చేయాల‌ని ఆశ‌గా ఉందంటూ చెప్పుకొచ్చింది.
కొన్ని రోజుల క్రితం ఆ ప్రాజెక్ట్ కోసం సామ్ - నాగ‌చైత‌న్య‌లు క‌లిసి బెంగ‌ళూరు వెళ్లారు. ఆ సినిమా చూసి సామ్..తెలుగు లో ఈ సినిమా చేయ‌నున్న‌ట్లు చెప్పింది. క‌న్న‌డం లో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌వ‌న్ కుమారే తెలుగులోనూ డైర‌క్ట్ చేస్తాడ‌ని అన్న‌ది. రెండేళ్ల కిందట వచ్చిన ‘యు టర్న్’ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన సామ్.. ఆ సినిమాను రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటోంది. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేసింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి.
అయితే సామ్ ఈ మధ్యే సినిమా షూటింగ్ ప్రారంభమైందని ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ‘యు టర్న్’ చిత్రీకరణ మొదలైన సంగతిని వెల్లడించింది. ఈ సినిమాకు ప‌వ‌న్ కుమార్ డైర‌క్ట్ చేస్తుండ‌గా సమంత ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మారుతోంది. నాగచైతన్యతో కలిసి ఆమె ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ స్టోరీ విష‌యానికొస్తే బెంగళూరులోని ఓ ఫ్లై ఓవర్ మీద వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే కథానేపథ్యంగా యూటర్న్ రూపొందింది. రోడ్డు ప్రమాదంలో వాహనపుదారులు ప్రాణాలు కోల్పోవడంలో కొన్ని అంశాలు అనేక అనుమానాలకు దారితీస్తాయి. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది.
యూటర్న్ చిత్రంలో జర్నలిస్టు, పోలీసుల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రను పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories