సికింద్రాబాద్ చిలకలగూడలో విషాదం

x
Highlights

సికింద్రాబాద్ చిలకలగూడలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనంపై నుంచి పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 18 నెలల చిన్నారి శ్రేయ...

సికింద్రాబాద్ చిలకలగూడలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనంపై నుంచి పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 18 నెలల చిన్నారి శ్రేయ కిందపడిపోతుండగా రక్షించేందుకు ప్రయత్నించిన పదేళ్ల పల్లవి కూడా కిందికి పడిపోయింది. దీంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. 18 నెలల చిన్నారి మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లోని శివాలయం వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories