రాహుల్ టూర్‌కి టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్

x
Highlights

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకి తెలంగాణ భవన్‌లో జరగబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర...

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకి తెలంగాణ భవన్‌లో జరగబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులను ఆహ్వానించారు. అయితే రాహుల్ పర్యటన సమయంలోనే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. ఈ భేటీ తర్వాత కేసీఆర్ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి టీఆర్‌ఎస్‌ కార్యవర్గ భేటీ ఫెడ్యూల్ ప్రకారం ఇవాళ లేదు. కానీ హఠాత్తుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ ఏర్పాటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories