ఆ రైళ్లలో ప్రయాణం చేసే వారికి చేదు వార్త!

ఆ రైళ్లలో ప్రయాణం చేసే వారికి చేదు వార్త!
x
Highlights

ప్లాట్ ఫామ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది సెంట్రల్‌ రైల్వే ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వ తేదీ వరకు తాత్కాలికంగా నాలుగు రైళ్లను రద్దు...

ప్లాట్ ఫామ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది సెంట్రల్‌ రైల్వే ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వ తేదీ వరకు తాత్కాలికంగా నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సెంట్రల్‌ రైల్వే నాగపూర్ రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సికింద్రాబాద్‌-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 12771)ను మే 30వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు నాగపూర్‌ స్టేషన్‌కు బదులుగా అజ్ని స్టేషన్‌ వరకు నడుపుతున్నారు. అంతేకాదు నాగపూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 12772)ను మే 31వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు నాగపూర్‌ స్టేషన్‌కు బదులుగా అజ్ని స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. ఇక ముంబై సీఎస్‌టీఎం-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 11401)ను మే 28వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు నాగపూర్‌ స్టేషన్‌కు బదులుగా అజ్ని స్టేషన్‌ వరకు నడపబడుతోంది. అలాగే నాగపూర్‌-ముంబై సీఎస్‌టీఎం (రైల్‌ నెంబర్‌: 11402) మే 31వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు నాగపూర్‌ స్టేషన్‌ నుంచి కాకుండా అజ్ని స్టేషన్‌ నుంచి బయల్దేరుతుదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో నాగపూర్ ప్రయాణికులకు కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories