ఫెడరల్ ఫ్రంట్ గురించి టీఆర్ఎస్‌తో మరిన్ని చర్చలు..

ఫెడరల్ ఫ్రంట్ గురించి టీఆర్ఎస్‌తో మరిన్ని చర్చలు..
x
Highlights

ఫెడరల్ ఫ్రంట్ గురించి టీఆర్ఎస్‌తో మరిన్ని చర్చలు జరుగుతాయని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రాలకు మేలు జరగాలంటే ఒకే ఆలోచనతో ఉన్నవారంతా కలసి ముందుకు సాగాలని కేటీఆర్‌తో చర్చల తర్వాత వ్యాఖ్యానించారు.

ఫెడరల్ ఫ్రంట్ గురించి టీఆర్ఎస్‌తో మరిన్ని చర్చలు జరుగుతాయని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రాలకు మేలు జరగాలంటే ఒకే ఆలోచనతో ఉన్నవారంతా కలసి ముందుకు సాగాలని కేటీఆర్‌తో చర్చల తర్వాత వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్న జగన్ ఫెడరల్ ఫ్రంట్ గురించి కేసీఆర్‌తో త్వరలో చర్చిస్తానని చెప్పారు. 25 మంది ఏపీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం చేయడం కష్టమని జగన్ అన్నారు. అందుకే తెలంగాణ ఎంపీలతో కలసి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు తెలంగాణ రాష్ట్రా ఎంపీల మద్దతు తప్పకుండా అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories