'రాజుగారి గ‌ది2' ట్రైల‌ర్ కి టైమ్ ఫిక్స‌య్యింది

రాజుగారి గ‌ది2 ట్రైల‌ర్ కి టైమ్ ఫిక్స‌య్యింది
x
Highlights

'మ‌నం' చిత్రంలో త‌ల్లీకొడుకులుగా న‌టించిన స‌మంత‌, అక్కినేని నాగార్జున.. ప్ర‌స్తుతం 'రాజు గారి గ‌ది2' చిత్రంలో మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి...

'మ‌నం' చిత్రంలో త‌ల్లీకొడుకులుగా న‌టించిన స‌మంత‌, అక్కినేని నాగార్జున.. ప్ర‌స్తుతం 'రాజు గారి గ‌ది2' చిత్రంలో మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్ మెంట‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, స‌మంత ఆత్మ పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. సీర‌త్ క‌పూర్‌, వెన్నెల కిషోర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2015లో వ‌చ్చిన 'రాజుగారి గ‌ది'కి కూడా ఓంకార్‌నే ద‌ర్శ‌కుడు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ని మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఏ టైంలో విడుద‌ల చేయ‌బోతున్నారో కూడా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. రేపు ఉద‌యం 10 గం|| 30 ని|| ల‌కి 'రాజుగారి గ‌ది2' ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు. థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న 'రాజుగారి గ‌ది2'ని దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories