మా మధ్య ఎదో ఉందన్నది ప్రచారం మాత్రమే : జేడీ చక్రవర్తి

మా మధ్య ఎదో ఉందన్నది ప్రచారం మాత్రమే : జేడీ చక్రవర్తి
x
Highlights

జేడీ చక్రవర్తి కొద్ది సినిమాలతోనే తెలుగు తెరపై ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరో. అర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన జేడీ.. విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి...

జేడీ చక్రవర్తి కొద్ది సినిమాలతోనే తెలుగు తెరపై ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరో. అర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన జేడీ.. విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి సినిమాలు చేశారు. ఇపుడు హిప్పీ సినిమాలో కీలకమైన పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 6 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జేడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

తాజా గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకూ.. హీరోయిన్ మహేశ్వరికీ మధ్య ఎఫైర్ ఉందని వచ్చిన వార్తల గురించి స్పందించారు. 'గులాబీ' సినిమాలో నాకు .. మహేశ్వరికి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దాంతో మా ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ లేదు. మహేశ్వరి కోసం నేను .. కృష్ణవంశీ గొడవపడ్డామనే వార్తలో నిజం లేకపోలేదు. కానీ ఎఫైర్ల వరకూ ఎప్పుడూ వెళ్లలేదు" అని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories