అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం

అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం
x
Highlights

అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశం నుంచి బయటకు వెళ్తున్న ప్రధాని మోడీ విజయసాయి రెడ్డిని చూసి...

అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశం నుంచి బయటకు వెళ్తున్న ప్రధాని మోడీ విజయసాయి రెడ్డిని చూసి ఆగారు. హాయ్ అంటూ సాయి రెడ్డిని పలకరించారు. అంతే కాదు, విజయసాయి రెడ్డికి షేక్‌ హ్యాండిచ్చారు. ఇక, జమిలి ఎన్నికలతోపాటు పలుకీలక అంశాలపై జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు కొనసాగింది. సగానికి పైగా పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి. ఇందులో టీఆర్ఎస్, వైసీపీ కూడా ఉన్నాయి. అయితే ఎంఐఎం, సీపీఐ, సీపీఎం మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. భేటీకి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఎంసీ, డీఎంకే దూరంగా ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories