కేంద్రంలో ఆ ప్రభుత్వమే రాబోతోంది: చంద్రబాబు జోస్యం

కేంద్రంలో ఆ ప్రభుత్వమే రాబోతోంది: చంద్రబాబు జోస్యం
x
Highlights

ఏపీలో ఎన్నికల సమరం ముగియడంతో ఇక ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలపై కన్నేసాడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఓ వైపు ఈవీఎంలకు వ్యతిరేకంగా...

ఏపీలో ఎన్నికల సమరం ముగియడంతో ఇక ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలపై కన్నేసాడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఓ వైపు ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తునే మరోవైపు బీజేపీ యేతర పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్సీపీ-కాంగ్రెస్ (మహారాష్ట్ర), జేడీఎస్-కాంగ్రెస్(కర్నాటక) తరపున జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాబు నేడు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. కాగా ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు మమతాను మాత్రం బెంగాల్ టైగర్‌తో పోల్చి ప్రశంసలు కురిపించారు. కాగా ఈనెల 23న వెలువడనున్న ఫలితాల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇక కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ఆ ప్రభుత్వంలో మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారెు. మేమంతా తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories