ఐశ్వర్యకే వారి మద్దతు.. వాళ్లే కుట్ర పన్నారు : తేజ్ ప్రతాప్ యాదవ్

ఐశ్వర్యకే వారి మద్దతు.. వాళ్లే కుట్ర పన్నారు : తేజ్ ప్రతాప్ యాదవ్
x
Highlights

తామిద్దరి మనసులు కలవలేదంటూ ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పెళ్లయి ఆరు నెలలైనా గడవక...

తామిద్దరి మనసులు కలవలేదంటూ ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పెళ్లయి ఆరు నెలలైనా గడవక ముందే భార్య నుంచి విడాకులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే విడాకులకు ఐశ్వర్య మాత్రం ససేమీరా అంటున్నట్టు సంసాచారం. భర్త నుంచి విడిపోవడం తనకు ఇష్టం లేదని ఐశ్వర్య చేబుతుండగా ఆమెకు లాలూ కుటుంబసభ్యులు సైతం అండగా నిలుస్తున్నారు. అయితే కుటుంబసభ్యులు ఐశ్వర్యకే మద్దతుగా నిలవడాన్ని తేజ్ ప్రతాప్ జీర్ణించుకోలేక పోతున్నాడు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 'నేను రెండు నెలలుగా ఆమెతో మాట్లాడటం మానేశాను. తనతో కలిసి ఉండటం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాను. అయినప్పటికీ ఆమె నా కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి ఏం చెబుతుందో తెలియదు కానీ వారు పూర్తిగా ఆమెకే మద్దతు తెలుపుతున్నారు. ఐశ్వర్యను సపోర్టు చేయడం వెనుక ఏదో పెద్ద కుట్రే దాగి ఉంది. ఇందులో నా కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రధాన సూత్రధారిగా ఉన్నారని అన్పిస్తోంది. నా వాళ్లే నాపై కుట్రపన్నడం బాధగా ఉందంటూ' తేజ్‌ ప్రతాప్‌ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories