పోసానిని హైదరాబాద్‌లో తిరుగనివ్వం... టీడీపీ అల్టిమేటం

పోసానిని హైదరాబాద్‌లో తిరుగనివ్వం... టీడీపీ అల్టిమేటం
x
Highlights

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. పోసానిని హైదరాబాదులో తిరగనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ ఏజెంట్ లా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరి మాట్లాడాలని ఎంఎన్‌ శ్రీనివాస్‌ చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కు హుటాహుటిన వచ్చారు. అయితే, ఈలోగానే ప్రెస్ మీట్ ను ముగించుకుని పోసాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సీఎం చంద్రబాబుపై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అక్రమంగా తనవైపు తిప్పుకున్నారని, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం జెండా కప్పడం అభివృద్ధిలో భాగమా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని మోదీని విమర్శించటం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్ అవినీతి వ్యవహారం కోర్టులే చూసుకుంటాయని, చంద్రబాబు తన అవినీతిపై నార్కోఎనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ మరోసారి పోసాని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories