వైసీపీలో చేరిన జయసుధ..

వైసీపీలో చేరిన జయసుధ..
x
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షపార్టీ వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ఒకవైపు కీలకనేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్ . మరోవైపు...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షపార్టీ వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ఒకవైపు కీలకనేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్ . మరోవైపు సినీ గ్లామర్‌ను పొలిటికల్‌గా ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ పార్టీకి ఉహించని షాక్ తగిలింది. ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీ పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ ఈ 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పింది. ఈ ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు కాదు పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నడుకుంటానని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories