టీడీపీని నిలబెట్టింది ఆ రెండే..: జేసీ దివాకర్ రెడ్డి

టీడీపీని నిలబెట్టింది ఆ రెండే..: జేసీ దివాకర్ రెడ్డి
x
Highlights

ఏపీలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 120 స్కీములు పెట్టారని, దాన ధర్మాలు చేస్తే ఎవరైనా ఆయన కష్టాన్ని చూశారా? అని జేసీ దివాకర్...

ఏపీలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 120 స్కీములు పెట్టారని, దాన ధర్మాలు చేస్తే ఎవరైనా ఆయన కష్టాన్ని చూశారా? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం అమరావతిలో నారా చంద్రబాబు నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం చేశారని కేవలం ఏపీలో ఉన్న రైతులు బాగుపడాలని తీవ్రంగా శ్రమించారని చెప్పారు. ఏపీ ప్రజల కోసం అప్పు, సప్పూ చేసి మరీ ప్రజలు బాగుండాలని చంద్రబాబు తపన అని అన్నరు.

కాగా రైతుల కోసం ఇంతలా శ్రమిస్తే ఒక్కరైన చంద్రబాబును అభినందించాడా? ఎందుకు చెయ్యాలి? ఏం అవసరముంది ఈ సంక్షేమ కార్యక్రమాల్లో? కూడు, బట్ట పెట్టాయా? అని అన్నారు. కాగా తమ తెలుగుదేశం పార్టీన్ని నిలబెట్టేది కేవలం పసుపు - కుంకుమ, ముసలోళ్లకిచ్చే పింఛన్లు. ఈ రెండు పథకాలు లేకపోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలని జేసీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏపీలో మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీయే అధికార పగ్గాలు చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories