పరువు హత్య...ప్రాణం ఉండగానే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు

పరువు హత్య...ప్రాణం ఉండగానే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు
x
Highlights

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెతోపాటు అల్లుణ్ని కూడా అత్యంత పాశవికంగా హత్య చేశారు. తక్కువ కులం అబ్బాయిని...

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెతోపాటు అల్లుణ్ని కూడా అత్యంత పాశవికంగా హత్య చేశారు. తక్కువ కులం అబ్బాయిని పెళ్లిచేసుకుని తమ పరువు తీసిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దర్నీ కావేరీ నదిలో తోసేసి హత్య చేశారు. అత్యంత కిరాతమైన ఈ ఘటన గతవారం కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నందీష్(26), స్వాతి(19) గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో నందీష్, స్వాతి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మూడు నెలల క్రితం నందీష్, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇక తమిళనాడులో ఉండకుండా కర్ణాటకలోని మాండ్యా పోలీసు స్టేషన్ పరిధిలో నవ దంపతులు ఉంటున్నారు. అయితే కమల్ హాసన్ మీటింగ్ నవంబర్ 10న హోసూర్(తమిళనాడు)లో ఉండడంతో నందీష్, స్వాతి అక్కడికి వెళ్లారు. ఇక్కడ స్వాతి దూరపు బంధువు వీరిని చూసి ఆమె తండ్రికి సమాచారం అందించాడు. అప్పటికే హోసూర్‌లో ఉన్న స్వాతి తండ్రి తన బంధువులతో అక్కడికి చేరుకొని నవ దంపతులను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తానికి నవంబర్ 11న తెల్లవారుజామున 3 గంటల సమయంలో నందీష్, స్వాతి కాళ్లు, చేతులు కట్టేసి శివణసముద్ర వద్ద కావేరీ నదిలో తోసేశారు. అయితే రెండు రోజుల తర్వాత వీరి మృతదేహాలు నీటిపై తేలియాడడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు శ్రీనివాస్(స్వాతి తండ్రి)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరాన్ని తానే చేసినట్లు శ్రీనివాస్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories