రైలు దిగుతుండగా కరెంట్ షాక్.. పలువురికి గాయాలు

రైలు దిగుతుండగా కరెంట్ షాక్.. పలువురికి గాయాలు
x
Highlights

గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వేస్టేషన్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగింది. గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళ్తున్న గుంటూరు ప్యాసింజర్‌లో ఈ ఘటన...

గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వేస్టేషన్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగింది. గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళ్తున్న గుంటూరు ప్యాసింజర్‌లో ఈ ఘటన జరిగింది. బోగీలకు విద్యుత్ ప్రవహించడంతో రైలు దిగుతున్న ప్రయాణీకులకు కరెంట్ షాక్ తగిలింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో ప్రయాణీకులు ఫ్లాట్ ఫాం పైకి దూకేశారు. ఈ గందరగోళంలో పలువురు గాయపడ్డారు. వెంటనే తేరుకున్న రైల్వే సిబ్బంది.. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రైలులో సాంకేతిక లోపం కారణంగానే షార్ట్‌ సర్క్యూట్‌ అయినట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వే శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories