కమెడియన్ నుండి దర్శకుడిగా మరీనా శ్రీనివాస్ రెడ్డి ..

కమెడియన్ నుండి దర్శకుడిగా మరీనా శ్రీనివాస్ రెడ్డి ..
x
Highlights

హాస్యనటులు దర్శకులు అవడం కొత్తేమి కాదు . ఇప్పటికే ఈ ఖాతాలో చాలా మంది చేరిపోయారు . ఇప్పడు అ లిస్టులో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా చేరిపోయాడు ....

హాస్యనటులు దర్శకులు అవడం కొత్తేమి కాదు . ఇప్పటికే ఈ ఖాతాలో చాలా మంది చేరిపోయారు . ఇప్పడు అ లిస్టులో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా చేరిపోయాడు . ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న హాస్యనటులంతా కలిసి ఫ్లయింగ్ కలర్స్ పేరుతో ఎప్పటికప్పుడు గెట్-టు-గెదర్స్ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా కలుస్తున్న వీళ్లంతా నిర్మాతలుగా మారి, అదే పేరుతో ఓ నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు.

వీళ్లంతా కలిసి ఓ సబ్జెక్ట్ అనుకున్నారు . ఆ కథకు దర్శకత్వం వహించే బాధ్యతల్ని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. అలా దర్శకుడిగా మారిపోయాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. ఇందులో బ్రహ్మానందం నుంచి మొదలు షకలక శంకర్ వరకు దాదాపు హాస్యనటులంతా ఈ సినిమాలోనే ఉన్నారు. మూవీ మొత్తం ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందట. గుట్టుచప్పుడు కాకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories