వీరుడా..ఐ లవ్యూ... మేజర్‌ డౌండియాల్‌కు భార్య నికిత తుదివీడ్కోలు

వీరుడా..ఐ లవ్యూ... మేజర్‌ డౌండియాల్‌కు భార్య నికిత తుదివీడ్కోలు
x
Highlights

భార్యా భర్తల బంధం మాటలకు అందనిది ఒకరు దూరమైతే మరొకరు తట్టుకోలేరు ఆలాంటిది దేశ రక్షణ విధిలో అమరులైన వారి భార్యల దు:ఖం ఇక చెప్పలేనిది.. కన్నీళ్లు...

భార్యా భర్తల బంధం మాటలకు అందనిది ఒకరు దూరమైతే మరొకరు తట్టుకోలేరు ఆలాంటిది దేశ రక్షణ విధిలో అమరులైన వారి భార్యల దు:ఖం ఇక చెప్పలేనిది.. కన్నీళ్లు దిగమింగుతూ.. గుండె దిటువు చేసుకొని చివరి వీడ్కోలు పలుకుతారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత జరగిన ఎన్‌కౌంటర్లో చనిపోయిన మేజర్ విభూతి దౌండియాల్‌కు ఆయన భార్య ఇచ్చిన కడసారి వీడ్కోలు అందరి హృదయాలను కలచివేసింది.. దుఖాన్ని దిగమింగుకొని అమర్ హై.. జైహింద్ అంటూ భర్తకు నివాళులర్పించింది.

పుల్వామాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ భౌతిక కాయం చూసి ఆయన భార్య నికితా కౌల్ గర్వపడ్డారు. దౌండియాల్ పార్థీవ దేహాన్ని ఆయన స్వస్థలం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ తీసుకు వచ్చారు. దౌండియల్ భౌతిక కాయం పక్కనే కూర్చొన్న నికితా కౌల్ గుండె లోపలి నుంచి తన్నుకొస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు అయినా ఆ భారాన్ని గుండెల్లోనే దాచుకుని అమర్ హై.. జైహింద్ అంటూ భర్తకు నివాళులర్పించారు ఎంతో ఉద్వేగంతో " ఐ లవ్యూ విభూ..వియ్ లవ్ యూ" అంటూ చివరి సారిగా ముద్దు ఇస్తూ చెప్పడం అందర్ని కంటతడిపెట్టించింది. దేశ రక్షణ కోసం తన భర్త చేసిన త్యాగం తనకు గర్వకారణమని అన్నారు.

మేజర్‌ డౌండియాల్‌, నికితల వివాహం గతేడాది ఏప్రిల్‌లో జరిగింది. తొలి వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని మేజర్‌ దంపతులు ఎంతో ఆశపడ్డారు. పెళ్లి రోజు నాటికి సెలవు తీసుకుని ఇంటికి వస్తానని డౌండియాల్‌ భార్యతో చెప్పారు. ఇంతలోనే ఈ విషాధ ఘటన చోటుచేసుకోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories