వెండితెరపై కూతురిని చూడకుండానే..

వెండితెరపై కూతురిని చూడకుండానే..
x
Highlights

అతిలోకసుందరి శ్రీదేవి....పెద్దకూతురు జాన్వీ తొలి సినిమా చూడకుండానే కన్నుమూశారు. తెలుగు, తమిళ, హిందీ చిత్ర సీమల్లో...ఓ వెలుగు వెలిగారు శ్రీదేవి. తన...

అతిలోకసుందరి శ్రీదేవి....పెద్దకూతురు జాన్వీ తొలి సినిమా చూడకుండానే కన్నుమూశారు. తెలుగు, తమిళ, హిందీ చిత్ర సీమల్లో...ఓ వెలుగు వెలిగారు శ్రీదేవి. తన లాగే కూతుర్ని కూడా స్టార్‌ హీరోయిన్‌గా చూడాలనుకుంది. జాన్వీ తొలి సినిమా షూటింగ్‌... చివరి దశకు చేరుకున్న సమయంలో అతిలోక సుందరి కన్నుమూసింది.

దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ సూపర్‌ స్టార్‌గా వెలిగారు శ్రీదేవి. అగ్రహీరోలతో నటించి తిరుగులేని హీరోయిన్‌గా స్టార్ డమ్‌ సంపాదించుకుంది. ఎంతోమంది హీరోయిన్లు వచ్చినా శ్రీదేవి మాత్రం తనకు తానే సాటని నిరూపించింది. తన వారసత్వాన్ని కొనసాగించేందుకు పెద్ద కూతుర్ని సినిమాలకు పరిచయం చేసింది. మరాఠీలో హిట్టయిన సైరత్‌ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ధడక్‌ మూవీ షూటింగ్‌ చివరి దశకు వచ్చిన సమయంలో శ్రీదేవి కన్నుమూశారు.

కూతురు జాన్వీ సినీ ప్రపంచంలో స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టాలని భావించారు. తనలాగే తన కూతురు కూడా సినిమా రంగంలో రాణించాలని ఆశపడ్డారు. అందుకే సైరత్ మూవీ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సినిమా షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి శ్రీదేవి కూతురు జాన్వీ వెన్నంటే ఉన్నారు. నటనకు సంబంధించిన మెళుకువలు, సలహాలను ఇస్తూ వచ్చారు. జాన్వీ తప్పుటడుగులు వేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

కూతురు జాన్వీకి మంచి కెరీర్‌ అందించాలని నిత్యం తపన పడేది అతిలోకసుందరి. దఢక్‌ మూవీకి సంబంధించి ఎప్పటికపుడు షూటింగ్‌ వివరాలు తెలుసుకునేది. ఏం షాట్స్ తీశారు ఎలా యాక్టింగ్‌ చేసిందో తెలుసుకునే సూచనలు చేసేది. మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత ధడక్‌ ప్రమోషన్‌లో కూడా పాల్గొనాలని భావించింది. జాన్వీ మొదటి సినిమా రిలీజ్‌ కాకుండానే తన వారుసురాలిని తెరపై చూసుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories